Rajasthan: రాజస్థాన్ కోటాలో 70 ఏళ్ల రైతుకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. సదరు వ్యక్తి పిత్తాశయం(గాల్బ్లాడర్)లో ఏకంగా 6110 రాళ్లను విజయవంతంగా తొలగించారు. బాధతుడు చాలా ఏళ్లుగా కడుపునొప్పి, వాంతులు, ఇతర సమస్యలతో బాధపడుతున్నాడని తెలిసింది. ఆరోగ్య సమస్యలపై ఆస్పత్రికి వెళ్లడంతో అసలు విషయం తెలిసింది. స్కానింగ్ రిపోర్టులో గాల్బ్లాడర్లో రాళ్లు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేయాల్సిందిగా సిఫారసు చేశారు.