‘రాజా సాబ్’ ప్రీమియర్స్ విషయంలో పెద్ద గందరగోళం జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం నుంచి రేట్ల పెంపు జీవో మీద క్లారిటీ రాకపోవడంతో.. టికెట్ల అమ్మకాలు జరిగిన షోస్ పడకుండా పెద్ద గందరగోళమే జరిగింది. తాజాగా ఇదే విషయాన్ని ఒక సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి హాజరైన మైత్రీ శశిని ప్రశ్నిస్తే, అసలు ఆ రోజు ఏం జరిగింది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. “అప్పుడు ఇదే అంశం మీద కోర్టులో ఐదు కేసులు…