Home
Farmers
Farmers News
-
El Nino : ఎల్నీనో ఎఫెక్ట్.. తెలంగాణలో డ్రౌట్ అలర్ట్.!
El Nino : రాష్ట్రంలో ఎల్నీనో ప్రభావంతో సాధారణం కంటే వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్… -
Harish Rao: “నీకు మా రక్తం కావాలా”.. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
Harish Rao: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శైలిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న ఓ అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర సీఎం మాట్లాడిన మాటలు వింటుంటే సైకో లాగా, శాడిస్ట్ లాగా ఉందే తప్ప బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిలా లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎండలకు ఎండిపోతున్న పొలాలకు నీళ్లు పారించమని ప్రతిపక్షాలు కోరుతుంటే, ముఖ్యమంత్రి మాత్రం దానికి సమాధానం చెప్పకుండా నోటికి వచ్చినట్లు బూతులు పారిస్తున్నారని ఆగ్రహం… -
Rythu Bharosa : రైతులకు పెట్టుబడి సాయం.. మరో రూ.1,009 కోట్లు విడుదల
Rythu Bharosa : తెలంగాణలోని రైతులకు పెట్టుబడి సాయం అందించే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకం కింద నూతనంగా రూ. 1,009 కోట్ల నిధులను విడుదల చేయగా, ఆ మొత్తాన్ని నేరుగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. తాజా విడుదలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన మొత్తం రైతు భరోసా సాయం రూ. 8,759 కోట్లకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా సాగు… -
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
Telangana Drought Alert 2026: తెలంగాణలో ఈ ఏడాది ‘వర్షాకాలం’ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నెమ్మదిగా కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినా.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఈ సమయానికి సాగు పనులు ఊపందుకోవాల్సి ఉండగా.. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పొలాలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఇప్పటికే భూమి మొత్తం పచ్చగా కనిపించాల్సి ఉండగా.. విత్తనాలు మాడిపోగా, ఆరుమళ్లు ఇంకా మొలకెత్తలేదు. రైతులపై అదనపు… -
Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
ఉల్లి ధరల నియంత్రణతో పాటు రైతులకు మెరుగైన ఆదాయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బఫర్ స్టాక్ కోసం సేకరించే ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటాల్కు రూ.1,875 నుంచి రూ.2,125కు పెంచింది. కొత్త ధర జూలై 4 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే, ప్రభుత్వం వరుసగా ధరను పెంచుతున్నప్పటికీ సేకరణ మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఈ నిర్ణయం రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా?… -
Rythu Bharosa : రైతులకు గుడ్న్యూస్.. 5-6 ఎకరాలకు రైతు భరోసా జమ
Rythu Bharosa : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం సీజన్కు గాను ‘రైతు భరోసా’ నిధుల విడుదలలో సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 5 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 67.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 7,135.77 కోట్ల నిధులను నేరుగా జమ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ప్రతి అర్హులైన రైతుకు పెట్టుబడి సాయాన్ని అందజేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల… -
Siddipet : యాప్తో బయటపడిన యూరియా మాఫియా..!
Siddipet : సిద్దిపేట జిల్లాలో యూరియా పంపిణీ వ్యవహారం వరుస అక్రమాలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వం పారదర్శకత కోసం తీసుకువచ్చిన యాప్, వ్యాపారుల అక్రమాలను బట్టబయలు చేస్తోంది. కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు వ్యాపారులు, రైతులకు అందాల్సిన యూరియాను పక్కదారి పట్టిస్తూ, కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, వ్యాపారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేర్యాల ఘటన మరువకముందే.. బైరాన్ పల్లిలో మరో అక్రమం జిల్లాలోని చేర్యాలలో సుమారు 6,429 యూరియా బస్తాలు మాయమైన… -
Harish Rao : రేవంత్ రెడ్డి పెట్టేది ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ
Harish Rao : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిర్వహిస్తున్నది ఆశీర్వాద సభ కాదని, అది ముమ్మాటికీ రైతు వంచన సభేనని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జడ్చర్లలో నిర్వహించిన ఎస్ఐఆర్ (SIR) అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అడుగడుగునా రైతులను మోసం చేస్తూనే ఉందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రవర్తన, ఆయన మాట్లాడే తీరు పాలమూరు జిల్లా… -
Harish Rao : ‘రైతు ఆశీర్వాద సభ’ కాదు.. ‘రైతు క్షమాపణ సభ’ పెట్టుకోండి.!
Harish Rao : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలపై బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలకు, రైతులకు నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. హామీలు 100 రోజుల్లో నెరవేర్చకపోతే నిలదీయమన్న భట్టి విక్రమార్క మాటలను గుర్తు చేస్తూ.. “మరి ఇప్పుడు రండి, మిమ్మల్ని నిలదీస్తాం”… -
KCC New Rules 2026: కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
దేశంలోని రైతులకు వ్యవసాయ రుణాల ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి, రుణాల ఆమోదం, తిరిగి చెల్లింపు విధానాల్లో ఏకరూపత తీసుకురావడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకంలో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆదాయ గుర్తింపు, ఆస్తి వర్గీకరణ (IRAC) నిబంధనలకు అనుగుణంగా పంట కాలం (Crop Season) నిర్వచనాన్ని ఆర్బీఐ ప్రామాణీకరించింది. కొత్త నిబంధనల ప్రకారం: స్వల్పకాలిక (Short-Term)…
తాజావార్తలు
-
Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
-
Shreyas Iyer Record: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్గా శ్రేయస్ సరికొత్త చరిత్ర!
-
Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. ‘ఒయాసిస్ అకాడమీ’ ప్రారంభం
-
Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
-
Trump Tariffs: మళ్లీ షాకిచ్చిన ట్రంప్.. భారత్ సహా 17 దేశాలపై అమెరికా అదనపు సుంకం..
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!