ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏజెన్సీలో చిన్న చినుకుపడితే చాలు రోడ్లన్నీ అధ్వాన్నంగా మారిపోతాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే.. గర్భిణీలకు చాలా ప్రమాదకరం. ఎందుకంటే పురిటినొప్పులతో ఆ రోడ్లను దాటి వెళ్లడం సాధ్యం కాదు.. అంతకుమించి అక్కడికి ఏ వాహనాలు రావు. ఒకవేళ వచ్చినా, అందులో కూరుకుపోవాల్సిందే.