India Power Consumption: భారత దేశంలో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యుత్ వినియోగం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరిలో భారతదేశ విద్యుత్ వినియగోం 10 శాతం పెరిగి 1375.57 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. 2021-22లో సరఫరా అయిన విద్యుత్ ను ఇప్పటికే అధిగమించాం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1245.54 బిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. తాజాగా ఈ ఏడాది దాన్ని మించిన విద్యుత్ వినియోగం జరిగింది.