ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా పడుతోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రీమియం పెట్రోల్తో పాటు ఇండస్ట్రియల్ డీజిల్ ధరలను కూడా పెంచాయి. పారిశ్రామిక డీజిల్ ధర ఇప్పుడు లీటరుకు రూ.22.03 పెరిగింది. దీని ధరను లీటరుకు రూ.87.57 నుండి రూ.109.59కి పెంచారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) పారిశ్రామిక డీజిల్ ధరను లీటరుకు రూ.87.67 నుండి రూ.109.59కి పెంచింది.…
‘‘అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట.’’ ఇది టాలీవుడ్ సినిమాలోని ఒక పాత పాట. అచ్చం ఇప్పుడు అదే మాదిరిగా అయింది పశ్చిమాసియా యుద్ధం తీరు. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన యుద్ధం గురి తప్పిందా? ప్లాన్ మిస్ఫైర్ అయిందా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.