Madhyapradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ రైట్ వింగ్ గ్రూప్ వివాదాస్పద ప్రకటన చేసింది. ముస్లిం మహిళతో పారిపోయిన హిందూ యువకులకు రివార్డ్ ప్రకటించింది. రూ. 11,000లను బహుమతిగి ఇస్తామని చెప్పింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మతాంతర వివాహాలను నిరోధించే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం మత స్వేచ్ఛ చట్టం 2021 ఉన్నప్పటికీ.. హిందూ ధర్మ సేన అనే సంస్థ ఈ ప్రకటన చేసింది. హిందూ ధర్మ సేన అధ్యక్షుడు యోగేష్ అగర్వాల్ ఈ ప్రకటన చేశాడు.