ఆర్థిక రాజధాని, వ్యవసాయం లో కీలక పాత్ర పోషించే మహారాష్ట్ర లో బీజేపీ గెలవడం సంతొషమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిన డబల్ ఇంజన్ సర్కార్ పై మహారాష్ర్ట ప్రజలు అత్యధిక ఓట్లు, సీట్లు ఇచ్చారని, గత పార్లమెంట్ ఎన్నికల్లో రిజర్వేషన్ లు ఎత్తివేస్తారని చేసిన ప్రచారం తో కాంగ్రెస్ లబ్ధి పొందిందన్నారు.
హ్యట్రిక్ విజయం కోసం బరిలో దిగిన మంత్రి ఆర్కే రోజాకు నగరి ఓటర్లు గుణపాఠం చెప్పారు. అవసరం ఉన్నా లేకున్నా ప్రతిపక్ష పార్టీ నేతలపై నోరేసుకుని పడిపోయి నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేసి APIIC ఛైర్మన్గా, మంత్రిగా అడ్డగోలుగా దోచిన తీరుపై తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో ప్రదర్శించారు.. రెండున్నరేళ్లు మంత్రిగా ఆధికారం చెలాయించినా నియోజకవర్గంలో ఎలాంటి ప్రగతి లేకపోవడం, కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం కూడా ఓటమికి బాటలు వేసింది. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా సొంత పార్టీ నేతలే…
ఈ సరి జరిగిన లోక్ సభ ఎన్నికలు ఎవరికీ అంతు చిక్కపట్టలేదు. ఒడిశా రాష్ట్రంలో గత రెండు దశాబ్దాలకు పైగా పాలిస్తున్ననవీన్ పట్నాయక్ కంచుకోటాని బీజేపీ బద్దలుకొట్టింది. ఒడిశాలో దాదాపు 24 ఏండ్ల పాటు ఏకచత్రాధిపత్యం చెలాయించిన రాష్ట్ర సీఎం, బిజూ జనతా దళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ జైత్ర యాత్రకు బ్రేక్ పడింది. ఒడిశాలో లోక్సభ ఎన్నికల ఫలితాల్లోనూ బీజేపీ ఆధిక్యం కనబరిచింది. రాష్ట్రంలో మొత్తం 21 లోక్సభ స్థానాలు ఉండగా ఎన్నడూ లేని విధంగా…