CM Jagan Review Meeting On Education Department: అమరావతిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై శుక్రవారం నాడు అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి క్లాసులో డిజిటల్ బోధన చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇంటరాక్టివ్ డిస్ప్లే లేదా ప్రొజెక్టర్లతో ప్రభుత్వ బడిపిల్లలకు మరింత విజ్ఞానం పెరుగుతుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. నాడు-నేడు రెండో దశ కింద 22,344 స్కూళ్లలో చేపడుతున్న పనుల ప్రగతిని సీఎం జగన్కు అధికారులు వివరించారు.…