శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో పురోభివృద్ధి సాధించినప్పటికీ సమాజంలో బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు మాత్రం పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా పిల్లలను పోషించే శక్తిలేక బాల్యంలోనే పెళ్లిళ్లు చేయడానికి సిద్ధపడుతున్నారు కొందరు తల్లిదండ్రులు. ఆస్తులను ఆశగా చూపి తమ కంటే 20 ఏళ్లు తక్కువ వయసున్న బాలికలను పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారు కొందరు వ్యక్తులు. ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. షాద్ నగర్ నందిగామలో బాల్య వివాహం చేసుకున్న వ్యక్తిపై…