Delhi University: ఢిల్లీ యూనివర్సిటీలోని లక్ష్మీబాయి కాలేజీ ప్రిన్సిపాల్ క్లాస్ రూం గోడలపై ఆవు పేడ పూస్తున్న వీడియో వైరల్గా మారింది. ప్రిన్సిపాల్ ప్రత్యూష్ వల్సల, ఇది ఓ రీసెర్చ్ ప్రాజెక్టులో భాగమని చెప్పారు. ‘‘ఇది ఒక ప్రాసెస్లో భాగం, ఒక వారంలో పరిశోధన పూర్తువుతుంది. అప్పుడు వీటి వివరాలను నేను మీతో పంచుకోగలను. పోర్టా క్యాబిన్లలో పరిశోధన జరుగుతోంది.
మనుస్మృతి బోధించాలన్న లా ఫ్యాకల్టీ ప్రతిపాదనను ఢిల్లీ యూనివర్సిటీ తిరస్కరించింది. యూనివర్శిటీలో అది జరగదని డీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ తేల్చిచెప్పారు.