Doctor Suicide: మహారాష్ట్ర సతారాలో వైద్యురాలి ఆత్మహత్య ఘటన దేశంలో సంచలనంగా మారింది. 26 ఏళ్ల లేడీ డాక్టర్ తన మరణానికి కారణం ఓ ఎస్సై అని పేర్కొంటూ, తన చేతిపై సూసైడ్ నోట్ రాసి సూసైడ్ చేసుకుంది. ఫల్తాన్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్య అధికారిగా ఉన్న వైద్యురాలు, గురువారం రాత్రి ఉరి వేసుకుని మరణించింది. ఎస్ఐ గోపాల్ బద్నే తనపై 5 నెలల్లో నాలుగు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది.
Kerala Doctor Suicide: కేరళలో ఓ యువ వైద్యురాలి మరణం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 22 ఏళ్ల షహానా వరకట్న వివాదంతో ఆత్మహత్యకు పాల్పడింది. షహనా బాయ్ఫ్రెండ్ డాక్టర్ ఇఏ రువైస్ ఆమెను పెళ్లి చేసుకునేందుకు భారీగా కట్నాన్ని డిమాండ్ చేశారు. ఏకంగా బీఎండబ్ల్యూ కారు, 150 తులాల బంగారం, 15 ఎకరాల భూమిని డిమాండ్ చేశాడు. రువైస్ వరకట్న దాహాన్ని తీర్చలేకపోవడంతో, షహానాతో వివాహం ఆగిపోయింది.