గచ్చిబౌలి పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి రెండు గంటల సమయంలో డివైడర్ ను బైక్ ఢీ కొట్టింది. ఇద్దరు యువకులు త్రిబుల్ ఐటీ చౌరస్తా నుంచి విప్రో సర్కిల్ వైపు బైక్ లో వెళ్తున్నారు. మితిమీరిన వేగంతో బైక్ నడుపుతూ.. డివైడర్ ను ఢీ కొట్టారు.
తెలంగాణలో కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంజ్ కార్ AP 09 BU 0990 కార్ అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టింది. అదే వేగంతో.. ఎదురుగా వస్తున్న మరో కార్ TS 05 UC 4666 టాటా విస్టాను ఢీ కొట్టడంతో దీంతో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు.
రోడ్డు ప్రమాదాల కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. హైదరాబాద్ లో నిత్యం రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా నిత్యం రద్దీగా వుండే గచ్చిబౌలి విప్రో జుంక్షన్ నుండి IIIT జుంక్షన్ వైపు బైక్ పై వస్తున్న ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు. ఇద్దరు మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. IIIT జుంక్షన్ వద్ద ఉన్న సబ్ స్టేషన్ గేట్ ను వేగంగా వచ్చి ఢీ కొట్టిందా బైక్. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి…