Hyderabad: గచ్చిబౌలి పరిధిలో ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి
- గచ్చిబౌలి పరిధిలో రోడ్డు ప్రమాదం
- ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
- నిన్న రాత్రి రెండు గంటల సమయంలో డివైడర్ ను బైక్ ఢీ కొట్టిన బైక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గచ్చిబౌలి పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి రెండు గంటల సమయంలో డివైడర్ ను బైక్ ఢీ కొట్టింది. ఇద్దరు యువకులు త్రిబుల్ ఐటీ చౌరస్తా నుంచి విప్రో సర్కిల్ వైపు బైక్ లో వెళ్తున్నారు. మితిమీరిన వేగంతో బైక్ నడుపుతూ.. డివైడర్ ను ఢీ కొట్టారు. దీంతో ఇద్దరు యువకులు స్పాట్ లోనే మృతి చెందారు. మృతులు అమెజాన్ లో పనిచేస్తున్న వైజాగ్ కు చెందిన దేవరకుమార్ స్వామి (25) గాజులరామారంలో నివాసం ఉంటున్న వేంకన్న స్వామి (30)గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు గచ్చిబౌలి పోలీసులు.
READ MORE: Amit Shah: అమిత్షా హెలికాప్టర్ను తనిఖీ చేసిన ఎన్నికల సంఘం అధికారులు (వీడియో)
Also Read
కాగా.. ఇండియాలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుందే తప్పా.. ఏమాత్రం తగ్గడం లేదు. సరైన ట్రాఫిక్ష్ రూల్స్ పాటించకపోవడం, నిర్లక్స్యంగా వ్యవహరించడం కారణంగా విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయితే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మగవాళ్లే చనిపోతున్నారు. వారిలో విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే బెంగళూరు నగరంలో 2023లో మొత్తం 913 ప్రమాదాలు జరగ్గా, 883 మంది మరణించారు. 2022 కంటే 2023లో ప్రమాదాలు 17 నుంచి 18 శాతం ఎక్కువ. 2022లో రోడ్డు ప్రమాదాల్లో 770 మంది మరణించారు. వారిలో 393 మంది 21-40 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు ఉన్నారు. గత ఏడాది బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో ఎక్కువ మంది పురుషులేనని, వారిలో ఎక్కువ మంది విద్యార్థులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పని చేసే వయసులో ఉన్నవారేనని డెక్కన్ హెరాల్డ్ అనే ప్రైవేట్ వార్తా సంస్థ వెల్లడించింది. హెల్మెట్ ధరించకపోవడం, అతివేగంగా నడపడం వల్లే ప్రమాదానికి కారణమని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే సిటీలో జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. అదేవిధంగా వాహనాల సంఖ్య కూడా పెరిగింది. దీంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
-
Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
-
YS Jagan: వైసీపీ ముఖ్య నేతలతో నేడు జగన్ కీలక భేటీ.. అజెండాలో కీలక అంశాలు
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
Strait of Hormuz: హోర్ముజ్పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!