'సోగ్గాడే చిన్ని నాయనా'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన స్టార్ యాంకర్ అనసూయ 'రంగస్థలం'తో నటిగా తన సత్తాను చాటుకుంది. అలానే మధ్య మధ్యలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ సోలో హీరోయిన్ గానూ సక్సెస్ ను అందుకుంటోంది.
బుల్లితెర యాంకర్ అనసూయ వరుస సినిమాలతో బిజీగా మారింది.. ఒకపక్క షోలు చేస్తూనే మరోపక్క నటిగా తన ప్రత్యేకతను చాటుకొంటుంది. ఇటీవల పుష్ప సినిమాలో దాక్షాయణిగా కనిపించనున్న ఈ భామ తాజాగా మరో కొత్త చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించింది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పేపర్ బాయ్ చిత్రంతో ఒక సున్నితమైన ప్రేమకథను పరిచయం చేసిన జయ శంకర్ ఈ సినిమాతో మరో కోణాన్ని వెలికితీయాలని చూస్తున్నాడు. ఇంకా టైటిల్…