తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ధరణి పోర్టల్కు రెండేళ్లు నిండాయి.. ధరణిలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమై నేటితో రెండేళ్లు పూర్తవుతుంది.. 2020 నవంబర్ 2న ప్రారంభించిన ధరణి భూ పరిపాలలో ఒక కొత్త అధ్యాయంగా చెప్పాలి.. ధరణికి ముందు రాష్ట్రంలో కేవలం 141 ప్రాంతాల్లో ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగగా.. ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏకంగా రాష్ట్రంలోని 574 మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.. ఇక, రిజిస్ట్రేషన్ల…
రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ‘ధరణి’ పోర్టల్ను తీసుకొచ్చారు.. మధ్యవర్తుల అవసరం లేకుండా.. లంచాలు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా ఈ వ్యవస్థను తీసుకొచ్చారు.. ధరణి అందుబాటులోకి వచ్చేముందే కాదు.. ఆ తర్వాత కూడా ఎన్నో సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది.. తెలంగాణలో ధరణి శకం మొదలై ఏడాది పూర్తయింది. అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన ధరణి పోర్టల్ను 2020 అక్టోబర్ 29న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా…