DGP Ravi Gupta: ట్రాఫిక్ నియంత్రణపై NSS (నేషనల్ స్టూడెంట్ సర్వీస్) వాలంటీర్లకు శిక్షణ మొదలు పెడుతున్నట్లు డీజీపీ రవిగుప్త తెలిపారు. మొదటి బ్యాచ్ శిక్షణను డీజీపీ రవి గుప్తా, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి శనివారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు. సీఎంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన వారిలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్త ఉన్నారు.
తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన మైనర్ అమ్మాయి అత్యాచారం, హత్య ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని డీజీపీని ఆదేశించారు.
తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసామని తెలిపారు డీజీపీ రవి గుప్తా. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కు ను వినిగించుకోవాలని సూచించారు. ఎక్కడా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, లోక్సభ 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసామని ఆయన పేర్కొన్నారు. 500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా.. 164 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్తో భద్రతా ఏర్పాట్లు చేసామని ఆయన వెల్లడించారు.…
రోహిత్ వేముల మృతి కేసు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. వాస్తవానికి ఈ కేసులో తెలంగాణ పోలీసులు దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై రోహిత్ తల్లి, సోదరుడు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు రోహిత్ వేముల ఆత్మహత్య కేసు వివాదం ముదిరినప్పుడు తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) రవి గుప్తా తదుపరి విచారణకు ఆదేశించారు. రోహిత్ ఆత్మహత్య కేసులో తెలంగాణ పోలీసుల క్లోజర్ రిపోర్టును చట్టపరంగా సవాలు చేస్తామని రోహిత్ వేముల కుటుంబ సభ్యులు…
ప్రయాణంలో ఆసౌకర్యం కలిగినందుకు సింగపూర్ ఎయిర్లైన్స్పై దావా వేశారు తెలంగాణ డీజీపీ రవి గుప్తా. పరిహారంగా రూ.2 లక్షలు తిరిగి అందుకున్నారు. హైదరాబాద్లోని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్-III సింగపూర్ ఎయిర్లైన్స్ను డీజీపీ రవి గుప్తాకి పరిహారంగా ₹2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. తెలంగాణ డీజీపీ రవి గుప్తా, ఆయన భార్య అంజలి గుప్తా మే 23, 2023న హైదరాబాద్ నుంచి సింగపూర్ మీదుగా ఆస్ట్రేలియాకు వెళ్లారు. బిజినెస్ (జెడ్) క్లాస్లోని రిక్లైనర్ సీట్లు ఎలక్ట్రానిక్…
DGP Ravi Gupta: తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఇయర్ అండ్ రివ్యూను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసులు, మీడియా సహకారంతో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు పూర్తి చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే 8.97 శాతం నేరాలు పెరిగాయని, ఈ ఏడాది 2,13,121 కేసులు నమోదయ్యాయని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాలు 17.59 శాతం పెరిగాయి. ఈ ఏడాది 1108లో…