రాగస తుఫాన్ హాంకాంగ్, దక్షిణ చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్లో తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఓ వైపు భారీ వర్షాలు.. ఇంకోవైపు 200 కి.మీ వేగంతో గాలులు వీచడంతో ప్రధాన పట్టణాలన్నీ అతలాకుతలం అయ్యాయి. తుఫాన్ కారణంగా తైవాన్లో 14 మంది, ఫిలిప్పీన్స్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Indonesia : ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో అకస్మాత్తుగా కుండపోత వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 19 మంది మరణించారు. ఏడుగురు తప్పిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.