రేపు ఎన్డీయే ముఖ్యమంత్రుల, ఉపముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ప్రధాని అధ్యక్షతన జరగనున్న ఎన్డీయే సమావేశం నిర్వహించనున్నారు. సుపరిపాలన, ఉత్తమ పద్ధతులపై ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలు చర్చించనున్నారు. సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.