సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తర్వాత రెండు కూటమిల మధ్య ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్డీఏ, ఇండియా కూటమిలు దెబ్బ దెబ్బగా సీట్లు సాధించాయి. బీజేపీ సొంతంగా ఎక్కువ సీట్లు సాధించకపోయినా.. మిత్ర పక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు.
ఎన్డీఏ పక్షనేత మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బలపరచగా.. కూటమి పక్ష నేతలంతా ఏకగ్రీవంగా మోడీని ఎంచుకున్నారు. మంగళవారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది.
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కి ఢిల్లీ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ని కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఈడీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది.
గత కొన్ని రోజులుగా విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికలు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టొరంటో వెళ్తున్న విమానంలో బాంబు ఉందని ఈమెయిల్ రావడంతో తీవ్ర భయాందోళన నెలకొంది. టొరంటోకు వెళ్లే ఎయిర్ కెనడా విమానంలో బాంబు ఉందని ఐజీఐ ఎయిర్పోర్ట్కు ఇమెయిల్ వచ్చిందని అధికారులు తెలిపారు.
నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి వర్గ భేటీ జరగనుంది. ఈ సమావేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగబోతుంది. అయితే గత ఎన్నికల కంటే తక్కువ స్థానాలు రావడంతో ఈ మంత్రివర్గ సమావేశానికి అధిక ప్రాధాన్యత సంతరించుకుంది.
దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె, భారతీయ జనతా పార్టీకి చెందిన బన్సూరి స్వరాజ్ విజయం సాధించారు. న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె.. 78,370 ఓట్ల తేడాతో ఆప్కి చెందిన సోమనాథ్ భారతిపై విజయం సాధించారు. ఔట్గోయింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్థానంలో తొలిసారిగా ఎమ్మెల్యే బన్సూరిని బీజేపీ రంగంలోకి దించింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. మూడోసారి అదే ఫార్ములా…
Delhi: ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు, బీజేపీ అనుకున్న విధంగా 2024 లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. మొత్తం 543 ఎంపీ సీట్లకు గానూ 2014, 2019లో బీజేపీ సొంతగానే మ్యాజిక్ ఫిగర్ మార్క్ 272ని దాటింది. అయితే, ఈ సారి మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం,
రేపు (మంగళవారం) లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. రేపు ఫలితాలు వెలువడిన తర్వాత ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలపై చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వర్గాలు తెలిపాయి. కాగా.. కూటమి నేతలు సమావేశం రేపు సాయంత్రం లేదా బుధవారం జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఢిల్లీలోని సరితా విహార్ పోలీస్ స్టేషన్ సమీపంలో తాజ్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. రైలులోని నాలుగు బోగీల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుంది.
నోయిడాలోని సెక్టార్-8 ప్రాంతంలో ఆదివారం ఒక ప్లాట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు 35 కార్లు దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. స్కోడా స్క్రాప్ చేసిన కార్లను ఖాళీ స్థలంలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇక అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం.., మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటల గురించి కాల్ వచ్చిందని., తాము వెంటనే ఫైర్ ఇంజెన్స్ తో అక్కడికి చేరుకుంట్లు తెలిపారు. Iceland: ఐస్లాండ్ అధ్యక్షురాలిగా ఎన్నికైన ‘హల్లా టోమస్డోత్తిర్’..…