Delhi Car Blast: చాలా బాధాకరం.. దాడులతో సంబంధంలేదన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీ
- చాలా బాధాకరం
- దాడులతో సంబంధంలేదన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ కారు బాంబ్ పేలుడు తర్వాత హర్యానాలోని ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ పేరు మార్మోగుతోంది. ఢిల్లీ బ్లాస్ట్లో పాల్గొన్న అనుమానిత వైద్యులు అల్ ఫలాహ్లోనే పని చేస్తున్నారు. పట్టుబడ్డ వైద్యులు.. యూనివర్సిటీలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీపై అనేక కథనాలు వెలువడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Hyderabad: శుభకార్యంలో రెచ్చిపోయిన హిజ్రాలు.. డబ్బులు ఇవ్వలేదని గుంపుగా దాడి
Also Read
- PM Kisan 24th Installment: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
- Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
ఈ నేపథ్యంలో అల్ ఫలాహ్ యూనివర్సిటీ యాజమాన్యం స్పందించింది. ఢిల్లీ పేలుడు దురదృష్టకర సంఘటనగా పేర్కొంది. ఢిల్లీ పరిణామాలు తమను ఎంతగానో బాధించాయని.. తమ సంస్థపై వస్తున్న కథనాలను ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భూపిందర్ కౌర్ ఆనంద్ పేరిట ఒక ప్రకటన విడుదలైంది. వైద్యులతో తమకు వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉందని స్పష్టం చేసింది. 1997 నుంచి అనేక విద్యాసంస్థలు నిర్వహించామని.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్గా కూడా అధికారికంగా గుర్తించిందని వెల్లడించింది. 2019 నుంచి ఎంబీబీఎస్ కోర్సు నిర్వహిస్తున్నామని.. ఇక్కడ విద్యను అభ్యసించినవాళ్లు దేశ, విదేశాల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నట్లు స్పష్టం చేసింది. అయితే ప్రస్తుత దురదృష్టకర సంఘటనలు బాధించినట్లుగా పేర్కొంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ఇటీవల ఫరీదాబాద్లో పట్టుబడిన వైద్యులు.. ఇదే యూనివర్సిటీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: భూటాన్లో ‘కాలచక్ర అభిషేక’ను ప్రారంభించిన మోడీ
సోమవారం (10-11-2025) సాయంత్రం 6:50 గంటల ప్రాంతంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్-1 సమీపంలో కారు బ్లాస్టింగ్ జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
PM Kisan 24th Installment: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!