మాజీ ఎమ్మెల్యే పగడాల రామయ్య ఆశయాలను కొనసాగించాలని మార్కాపురం ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ కుందురు నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. పగడాల రామయ్య 6వ వర్ధంతి రాచర్ల మండలం చినగానిపల్లె గ్రామంలోని ఆయన నివాసంలో సోమవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు వైసీపీ ఇంచార్జ్ కుందూరు నాగార్జునరెడ్డి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.