Cyber Fraud: సైబర్ నేరగాళ్లు రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ఒకరు, రివార్డ్ పాయింట్ల పేరుతో మరొకరు సైబర్ దాడికి గురై లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు.
'హలో... నేను టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ నుండి ఫోన్ చేస్తున్నాను. మీ ఫోన్ నంబర్ కొన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించబడుతోంది. మేము ఈ నెంబర్ ను మూసివేస్తున్నాము. మీరు మీ నంబర్ను కొనసాగించాలనుకుంటే, మేము చెప్పిన వాటిని ధృవీకరించాలి...' అని మోసపూరితమైన కాల్స్ చేస్తుంటారు. ఒకవేళ.. ఈ కాల్ ని అలానే కొనసాగిస్తే మీ అకౌంట్ లో ఉన్న డబ్బును కొట్టేస్తారు. ఇదొక సైబర్ మోసం.. +92 నంబర్ నుండి వినియోగదారుల వాట్సాప్కు కాల్లు వస్తున్నాయి. ఫోన్ చేస్తున్న…
Call Forwarding : పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు కాల్ ఫార్వార్డింగ్ సౌకర్యాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అన్ని టెలికాం కంపెనీలకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ నుండి ఆదేశాలు ఇవ్వబడ్డాయి.
Cyber Fraud: సైబర్ మోసాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి లాటరీ తగిలిందని, లక్కీ డ్రా తీశామని, బంగారు, బంగారు నాణేలు వచ్చాయని చెప్పి మోసాలకు పాల్పడి దరఖాస్తుకు ఓటీపీ ఇవ్వాలని కోరుతున్నారు.
ఓ మహిళకు పార్ట్టైం జాబ్ ఆఫర్ చేసిన స్కామర్లు ఆమె దగ్గర నుంచి ఏకంగా 3.37 లక్షల రూపాయలను కొట్టేశారు. ఈ సంఘటన లక్నోలో వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన కుష్భు పాల్ అనే మహిళను స్కామర్లు పార్ట్ టైం జాబ్ పేరుతో మోసం చేశారు.
దేశంలో డిజిటల్ లావాదేవీలు భారీగా కొనసాగుతున్నాయి. డిజిటల్ మోసాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా బ్యాంకుల ప్రతినిధులతో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషీ సమావేశం నిర్వహించారు. ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, టెలికాం, ఐటీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాతోపాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Cyber Fraud: సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్త మోసాలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో రోజుకో కొత్త తరహా సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది స్కామర్లు సులభంగా డబ్బు సంపాదించడానికి మోసాలబాట ఆశ్రయిస్తున్నారు.
Jagtial Young Man Venkat Sai Was Cheated by Cyber Criminals: సైబర్ కేటుగాళ్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. నిత్యం ఓ అడుగు అడ్వాన్స్గా ఉంటూ.. అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా అమాయకులకు ఎరవేసి.. వారి కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారు. సైబర్ నేరగాళ్ల తెలివికి.. అమాయకులు మాత్రమే కాదు సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ కూడా మోసపోతున్నారు. తాజాగా మరో సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. టాస్క్ పేరిట ఓ యువకుడికి ఏకంగా రూ. 3.17 లక్షలు టోకరా పెట్టారు.…
Cyber Investment Fraud: నేరస్తులు పంథా మార్చారు. గతంలోలాగా ఇళ్లను కొల్లగొట్టడం కాకుండా కొత్తగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. గిప్టులు, లక్కీ డ్రా, ఓటీపీల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రూ.854 కోట్ల సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. బెంగళూర్ కేంద్రంగా సైబర్ ఇన్వెస్ట్మెంట్ మోసాన్ని పోలీసులు ఛేదించారు. పెట్టుబడి పెడితే రోజుకు రూ. 1000 నుంచి రూ. 5000 వరకు లాభం పొందొచ్చని చెబుతూ దేశంలో వేలాది మందిని మోసం చేశారు.
Kamareddy Software Girl Lose Rs 50 Thuosand in E-Scam: ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. సైబర్ కేటుగాళ్లు రోజుకో రకం కొత్త మోసాలతో అమాయకులను సునాయాసంగా బురిడీ కొట్టిస్తున్నారు. జాబ్ ఆఫర్లు, ఈ కేవైసీ, ఖరీదైన గిప్ట్లు, డ్రగ్స్ పార్సిల్, లాటరీలతో మోసాలకు పాల్పడుతూ.. కోట్లలో డబ్బు సంపాదిస్తున్నారు. అమాయక ప్రజలే కాదు ఉన్నత ఉద్యోగంలో ఉన్న వారిని కూడా యిట్టె బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా సైబర్ కేటుగాళ్లు ఓ సాఫ్ట్వేర్ యువతికి…