Cyber Fraud: అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 5 లక్షలు..! ట్విస్ట్ ఏంటంటే..?
- యూపీలోని ప్రయాగ్రాజ్లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన
- సైబర్ ట్రాప్ లో పడ్డ యువకుడు
- అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 5 లక్షల జీతం
- చివరకు మోసపోయామని తెలుసుకుని సైబర్ క్రైమ్ ను ఆశ్రయించిన బాధితుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని ప్రయాగ్రాజ్లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ దుండగులు వివిధ మార్గాల్లో ప్రజలను ట్రాప్ చేస్తున్నారు. మౌయిమా ప్రాంతంలో కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఫేస్బుక్లో ఒక వినియోగదారు.. ధనిక కుటుంబాలకు చెందిన అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 5 లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తానని తెలిపాడు. ఈ ఆఫర్ చూసి ఓ యువకుడు ట్రాప్లో పడ్డాడు. దీంతో.. సైబర్ దుండగులు అతడిని సంప్రదించి రిజిస్ట్రేషన్ పేరుతో రూ.24800 కట్టించుకున్నారు. ఆ తర్వాత రూ. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో.. తాను మోసపోయానని బాధిత యువకుడు గ్రహించాడు.
Maharashtra Navnirman Sena: పదేళ్ల తర్వాత భారత్లో పాకిస్థాన్ సినిమా.. తన్నులు తప్పవు!
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ఈ ఘటన మౌయిమాలోని బక్రాబాద్ ప్రాంతంలో జరిగింది. అల్తాఫ్ ఖాన్ అనే యువకుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్లో ఈ ప్రకటనను చూశాడు. అందులో ధనిక కుటుంబాల అమ్మాయిలను గర్భవతిని చేసే ఉద్యోగం ఉందని, ఐదు లక్షల రూపాయల జీతంతో పాటు విలాసాలు కల్పిస్తామని అందులో రాసుంది. ఈ క్రమంలో.. యువకుడు అందులో నంబర్కు ఫోన్ చేయగా.. అడ్వర్టైజర్ మొదట రూ.800 కట్టాలని చెప్పాడన్నాడు. ఆ తర్వాత రిజిస్ట్రేషకు రూ.24 వేలు పంపించాడు. అడ్వర్టైజర్లు మళ్లీ యువకుడి నుంచి రూ.3 లక్షలు డిమాండ్ చేశారు. అయితే.. అసలు విషయాన్ని బాధితుడు తెలుసుకుని మోసపోయానని గ్రహించాడు.
Harassment: అత్తమామల వేధింపులు.. సెల్ఫీ వీడియో తీసుకుని అల్లుడు సూసైడ్
సైబర్ మోసగాళ్లు ఎస్పీ, డీఎస్పీల ప్రొఫైల్ ఫోటోలు ఉన్న నంబర్లతో కాల్ చేసి డబ్బు చెల్లించాలని బాధిత యువకుడిని టార్చర్ చేశారు. లేదంటే.. కేసు నమోదు చేసి ఇరికిస్తామని బెదిరించారు. దీంతో యువకుడు భయపడి గ్రామ సామాజిక కార్యకర్తకు విషయం చెప్పాడు. అనంతరం.. బాధితుడు సైబర్ క్రైమ్ ప్రయాగ్రాజ్కు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి డబ్బులు తిరిగి ఇప్పించాలని డీసీపీ క్రైం బాధితుడు కోరాడు. అయితే.. ఇంతకుముందు కూడా చాలా మంది యువకులు ఇలానే మోసపోయారని.. ఈ క్రమంలో అవమానానికి భయపడి వారు ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..