ఉగాండాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు-నాలుగు వాహనాలు ఒకేసారి ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 63 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఉత్తర ఉగాండాలోని ప్రధాన నగరమైన గులుకు వెళ్లే హైవేపై మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.