సామాజిక కార్యకర్త మేధా పాట్కర్కు మరోసారి చుక్కెదురైంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనా పరువు నష్టం కేసులో విధించిన శిక్షను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ను ఢిల్లీ కోర్టు బుధవారం కొట్టేసింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇచ్చిన నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు సమర్థించింది.