Covid-19 Cases: భారతదేశంలో కోవిడ్ మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. వాతావరణ పరిస్థితులు, చలి పెరడగం కూడా వ్యాధి పెరిగేందుకు కారణమవుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 656 కరోనా కేసులు నమోదు అవ్వగా.. ఒకరు మరణించినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 3742 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.