బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం లేదు అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై చేసిన విమర్శలు గుప్పించారు. దీంతో సీఎం కామెంట్స్ పై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. సీఎం సభను తప్పుదోవ పట్టించారు అంటూ ఆయన తెలిపారు.
గత ప్రభుత్వం లేఖలకే పరిమితం అయింది అంటూ విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు అది కమిషన్ ప్రాజెక్ట్.. మిషన్ భగీరథ తో జనాలకు ఒరిగింది ఏమి లేదు.. అనవసర ప్రాజెక్ట్ లు కట్టి రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టారు అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
MP Dhiraj Sahu: "నా డబ్బు కాదు, కానీ"..రూ.350 కోట్లపై తొలిసారి నోరు విప్పిన కాంగ్రెస్ ఎంపీ..ఇటీవల ఆదాయ పన్ను శాఖ(ఐటీ) ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో మద్యం వ్యాపారాలపై పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు నివాసాల్లో ఏకంగా రూ. 350 కోట్ల నగదు పట్టుబడటంతో దేశం మొత్తం ఒక్కసారిగా నివ్వెరపోయింది. గుట్టలు, గుట్టలుగా పట్టుబడిన నోట్ల కట్టల్ని లెక్కించేందుకు వందలాది మంది అధికారులు, పదుల సంఖ్యలో మిషన్లు అలసిపోయాయి.
Tipu Sultan Row: కర్ణాటకలో మరోసారి టిప్పు సుల్తాన్ వివాదం తెరపైకి వచ్చింది. గతంలో టిప్పు పేరు రాజకీయంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉద్రిక్తతకు కారణమైంది. మరోసారి మైసూరు విమానాశ్రయం పేరు మార్పు వివాదం నేపథ్యంలో టిప్పు వివాదం రాజుకుంది. మైసూర్ ఎయిర్ పోర్టు (మందకల్లి విమానాశ్రయం) పేరును టిప్పు సుల్తాన్ విమానాశ్రయంగా మార్చాలని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రతిపాదించారు. దీనిపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
Gidugu Rudra Raju Slams AP CM YS Jagan: ఏపీలో తమకు ప్రధాన ప్రత్యర్ధి సీఎం జగనే అని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఏపీలో వైఎస్ జగన్, కేంద్రంలో బీజేపీతో రాజీలేని పోరాటం కాంగ్రెస్ చేస్తుందన్నారు. బీజేపీతో అంటకాగేవే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు అని.. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని విమర్శించారు. తెలంగాణలో టీడీపీ మాయమైపోయిన పార్టీ అని, జెండాలు కనిపించినంత మాత్రాన కాంగ్రెస్ గెలుపుకు టీడీపీ కారణం…
Kishan Reddy: పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్రంలో ఒంటరిగానే పోరాడుతామని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను అధిగమించి సీట్లు పొందుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు.
రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నియంతృత్వ ధోరణితో పాలన కొనసాగింది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఉద్యమ లక్ష్యాలని నీరు కార్చారు.. కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగి వేసారిపోయారు.
MPs suspended: పార్లమెంట్లో వికృతంగా ప్రవర్తించినందుకు 15 మంది ఎంపీలు సస్పెన్షన్కి గురయ్యారు. సస్పెండ్ అయిన వారిలో ఒక రాజ్యసభ ఎంపీతో పాటు 14 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు. సస్పెండ్ అయిన సభ్యుల్లో మాణికం ఠాగూర్, కనిమొళి, పీఆర్ నటరాజన్, వీకే శ్రీకాంతం, బేణి బహన్, కే సుబ్రమణ్యం, ఎస్ఆర్ ప్రతిబన్, ఎస్ వెంకటేషన్, మహ్మద్ జావేద్ ఉన్నారు.
MLC Jeevan Reddy Slams KTR: కేటీఆర్.. నువ్ ఏం భయపడాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తమకు తెలుసని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని దీవించడం పోయి.. ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూస్తానని కేటీఆర్ పేర్కొనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ఘనత మీదేనని, రాష్ట్రన్ని నిండా అప్పులో ముంచారని, రాష్ట్ర సమాజాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మద్యానికి బానిసలుగా చేసిందని జీవన్…