రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శాసన సభలో ప్రవేశ పెట్టాం.. 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో తెలంగాణను నెట్టేశారు.. కేటీఆర్ ఓటమిని జీర్ణించుకోలేక స్వేద పత్రం పేరిట తప్పుడు లెక్కలు చెప్పారు.. స్వేద పత్రం కాదు, ప్రజల చెమటతో స్వేద సోధ భవనాలు నిర్మించారు.. బిఆర్ఎస్ నేతల ఆర్థిక పరిస్థితి స్వేద పత్రం విడుదల చేయాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
రేపు ఢిల్లీ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెళ్లనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో అపాయింట్మెంట్ ఖరారు కావడంతో రేపు సాయంత్రం 4. 30 గంటలకు ప్రధానిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అందిస్తామనే నమ్మకం కాంగ్రెస్ పార్టీకి ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గత వ్యవస్థలో తప్పులు జరిగాయని, వాటిని తాము సరిదిద్దుతామన్నారు. కొత్త ప్రభుత్వం, కొత్త ఆశలు, కొత్త నడవడికలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా పనిచేస్తుందని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజాపాలన జిల్లాస్థాయి సమన్వయ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా మంత్రి దామోదర రాజనర్సింహ వచ్చారు. Also Read: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్…
Sam Pitroda : రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు అయిన ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శామ్ పిట్రోడా ఈవీఎంలపై సంచలన ప్రకటనలు చేశారు. త్వరలో అంతర్జాతీయ నిపుణులతో దానిని బహిర్గతం చేయబోతున్నారని పేర్కొన్నారు.
సింగరేణి కార్మికులకు రూ. 20 లక్షల వడ్డీలేని రుణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సింగరేణి కార్మికులను తాను ఆదుకుంటానని, కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం కృషి చేస్తానన్నారు. గడిచిన పది సంవత్సరాలు నామవాత్ర ఉద్యోగాలు నియమించారని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను చేపట్టే కార్యక్రమం ప్రారంభించిందని పొంగులేటి చెప్పారు. ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం తీసుకోబోతుందని చెప్పుకొచ్చారు. ఇల్లందు సింగరేణి జెకే ఓపెన్ కాస్ట్ ఆఫీస్…
ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. తెలంగాణలో విజయం తర్వాత ఏపీపై రాహుల్ గాంధీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏపీలో కూడా పుంజుకుని పూర్వవైభవం వచ్చేలా కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గ్రామ సదస్సులకు ‘ప్రజాపాలన’గా పేరు మార్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టాలన్నారు. Also Read: India…
KTR Presentation On BRS Govt 9.6 Years Rule: ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ‘శ్వేతపత్రం’ తప్పుల తడక అని, అబద్ధాల పుట్ట అని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్దేశ పూర్వకంగానే బీఆర్ఎస్ పాలనను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రక్తాన్ని రంగరించి రాష్ట్రాన్ని ప్రగతి పధం వైపు నడిపించామని, విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లిన ఘనత తమ పార్టీది అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన ఆరోపణలు,…
వచ్చే లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక సంస్థాగత మార్పులు చేపట్టింది. పలు రాష్ట్రాలకు ఇంఛార్జులను కేటాయించారు. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కాంగ్రెస్ ఉత్తర్ ప్రదేశ్ ఇంఛార్జ్గా ఉన్న ప్రియాంకాగాంధీన వాద్రాను ఆ స్థానం నుంచి తప్పించారు. ఆమె స్థానంలో యూపీ ఇంఛార్జ్గా అవినాష్ పాండేని నియమించింది.