రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసి సంఘాలు భేటీ అయ్యాయి. జూబ్లీహిల్స్ లోని సీఎం అధికారిక నివాసంలో బుధవారం భేటీ అయిన పలు సంఘాల ప్రతినిధులు..తమ ప్రాంత సమస్యలను సీఎం కి వివరించారు
ఎన్సీ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర హోదా ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రధాని మోడీకి సమర్పిస్తామన్నారు. నియోజక వర్గాల పునర్విభజన, ఎన్నికలు, రాష్ట్ర హోదా లాంటి వాటి మీద తీర్మానం చేస్తామన్నారు. కొందరు నేతలు జమ్మూకశ్మీర్ను ఢిల్లీతో పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు శాపనార్థాలు తప్పితే సూచనలు లేవని.. దసరా సందర్భంగా ప్రతిపక్షాలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతున్నామన్నారు.
Manipur Congress Chief: మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె మేఘచంద్ర సింగ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్ల జారీ చేసింది. మణిపూర్ పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి ఎన్ బుపెండా మెయిటే మాట్లాడుతూ.. ఈడీ ప్రతీకార రాజకీయాలకు దిగుతుందని విమర్శించారు.
హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానా ఫలితాలను తాము అంగీకరించడం లేదని తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. హర్యానా ఫలితాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. హర్యానా ఫలితాలపై చాలా ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు.
ఇందిరమ్మ ప్రభుత్వం చారిత్రాత్మకంగా నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇవాళ ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. 11వ తేదిన ఇంటిగ్రేడెడ్ పాఠశాలలకు శంఖుస్థాపన చేయనున్నామన్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంటుందని, ఎక్స్ట్రా కల్చరల్ ఆక్టివిటీస్, స్కూల్ లోనే థియేటర్ ఉంటుందని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నార భట్టి విక్రమార్క. తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శం కానున్నాయని, గత ప్రభుత్వం నెల వారీగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని…
మహారాష్ట్రను కాపాడుకునేందుకు.. కాంగ్రెస్, ఎన్సీపీ సీఎంగా ప్రకటించిన ఎవరికైనా శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే/యూబీటీ) మద్దతు ఇస్తుందని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం తమపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఓటింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్.. కౌంటింగ్ రోజు భిన్నమైన ఫలితాలు రావడంతో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి అధికారంలో మార్పు వస్తుందని ఆ పార్టీ పూర్తి ఆశలు పెట్టుకుంది కానీ అది జరగలేదు. ఇలా ఎందుకు జరిగిందో అని ఎన్నికల విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ ఓటమికి ఈ అంశాలు ప్రముఖంగా నిలిచాయి.