Off The Record: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్నారు. ఇన్నాళ్ళు రకరకాలుగా ఎదురు చూసీ…చూసీ….ఇక ఫైనల్గా త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ మీదే హోప్స్ పెట్టుకున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పటి వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. మొదటిసారి విస్తరణ సమయంలో తర్వాత ఇస్తామని అధిష్టానం చెప్పినట్టు కొంతమంది ఎమ్మెల్యేలు ప్రచారం చేసుకున్నారు. కానీ రెండో విడత జరిగిన మంత్రివర్గ విస్తరణలో సైతం రంగారెడ్డి జిల్లాకు స్థానం…
తెలంగాణ ప్రభుత్వం తాజాగా విప్లను నియమించింది. వాటి విషయంలో ఇప్పుడు పార్టీ పరమైన రచ్చ మొదలైంది. ఆశావహులు భారీగా ఉండటం, నిరాశ పడటం సహజ పరిణామమే అయినా… ఇప్పుడో కొత్త వాదన కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. పదవుల పంపకాల్లో అంతా కొత్తగా వచ్చిన వాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని, కష్టకాలంలో అండగా ఉండి జెండా మోసిన వాళ్ళకు మొండి చేయి చూపిస్తున్నారన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. నమ్ముకుని ఉన్న వాళ్ళకు ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా అని కూడా…