Off The Record: మంత్రివర్గ విస్తరణ మీద ఉమ్మడి రంగారెడ్డి ఎమ్మెల్యేల ఆశలు
- మంత్రివర్గ విస్తరణ మీద ఉమ్మడి రంగారెడ్డి ఎమ్మెల్యేల ఆశలు..
- ప్రతిసారి జిల్లా గురించి చర్చ, నిరాశ..
- గతంలో ఖర్గేను కలిసిన జిల్లా ఎమ్మెల్యేలు..
- ఈసారి విస్తరణలో రెడ్లకు ఒక పదవి ఇస్తారన్న అంచనా..
- రెడ్డి కోటాలో ఇచ్చినా మాకు కావాలంటున్న జిల్లా ఎమ్మెల్యేలు..
- విప్ పదవుల్లో ఒక్కటి కూడా దక్కకపోవడంపై అసంతృప్తి..
- ప్రతిసారి అధిష్టానాన్ని కలుస్తున్న మల్రెడ్డి, రామ్మోహన్రెడ్డి..
- నాకో ఛాన్స్ అంటున్న చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్నారు. ఇన్నాళ్ళు రకరకాలుగా ఎదురు చూసీ…చూసీ….ఇక ఫైనల్గా త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ మీదే హోప్స్ పెట్టుకున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పటి వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. మొదటిసారి విస్తరణ సమయంలో తర్వాత ఇస్తామని అధిష్టానం చెప్పినట్టు కొంతమంది ఎమ్మెల్యేలు ప్రచారం చేసుకున్నారు. కానీ రెండో విడత జరిగిన మంత్రివర్గ విస్తరణలో సైతం రంగారెడ్డి జిల్లాకు స్థానం దక్కలేదు. దాంతో… ఉమ్మడి జిల్లాలోని పార్టీ శాసనసభ్యులంతా కలిసి అధిష్టానం పెద్దలకు లేఖ రాశారు. ఒకరిద్దరైతే… కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను కలిసి మంత్రివర్గ విస్తరణలో మా జిల్లా నుంచి ఎవరో ఒకరికి పదవి ఇవ్వాలని కోరారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు నలుగురు ఉండగా… మరో ఇద్దరు బీఆర్ఎస్ నుంచి ఇటువైపు మారారు.
Read Also: Donald Trump: సహకరించని నాటో దేశాలపై ట్రంప్ ఫైర్.. మేము దీన్ని గుర్తుంచుకుంటామంటూ హెచ్చరిక
Also Read
అలా… మొత్తం ఆరుగురిలో ముగ్గురిది రెడ్డి సామాజికవర్గం కాగా… ఒక బీసీ, ఇద్దలు ఎస్సీలు ఉన్నారు. ప్రస్తుతం క్యాబినెట్లో రెడ్డి కులం మంత్రులే ఎక్కువగా ఉన్నారు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కూడా ఆ సామాజిక వర్గానికి ఇంకో పదవి రావొచ్చన్న ఊహాగానాలున్నాయి. ఆ ఒక్క పదవి తమ జిల్లాకే ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు ఉమ్మడి రంగారెడ్డి ఎమ్మెల్యేలు. ఇటీవల అసెంబ్లీలో, మండలిలో ఖాళీగా ఉన్న విప్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. వాటిలో కూడా రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వలేదన్న అసంతృప్తి బలంగా ఉంది. అందుకే ఈసారి మాత్రం ఏదో ఒక కోటాలో మాకు కేబినెట్ బెర్త్ కావాల్సిందేనని పట్టుదలగా ఉన్నారట ఉమ్మడి రంగారెడ్డి ఎమ్మెల్యేలు. ఇబ్రహీంపట్నం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బియ్యని మధుసూదన్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు వచ్చిన ప్రతిసారి మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలిసి వస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి స్పీకర్ పదవి ఉండగా.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ హోదా దక్కింది. అయితే తనకు మంత్రి పదవి ఇవ్వాలని మహేందర్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో… ఈసారైనా అత్యంత కీలకమైన ఉమ్మడి రంగారెడ్డికి ప్రాధాన్యం ఇస్తారా? లేక వోవరాల్గా శాడ్ సాంగేనా అన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!