పొగాకు కొనుగోలు విషయంలో రైతులకు ఆందోళన వద్దని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిగిలిన 25 మిలియన్ కేజీల పొగాకు ప్రభుత్వం మార్క్ ఫెడ్ నుంచి కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 7 మార్కెట్ యార్డ్ ల నుంచి పొగాకు కొనుగోలు జరుగుతుందని తెలిపారు. రైతులు నల్లబెల్లి పొగాకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు.
కోకో పంట కాసులు కురిపిస్తోంది.. అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉన్న పంట కూడా ఇది.. చాక్లెట్లు, కాఫీ, కేకుల తయారీలో కోకో వినియోగిస్తారు.. క్రమంగా చాక్లెట్లు, కాఫీ, కేకుల కల్చర్ కూడా పెరిగిపోతుండడంతో.. ఆ పంట వేసిన రైతులకు సిరులు కురుస్తున్నాయి… కొబ్బరి, ఆయిల్పామ్ తోటల్లో అంతర పంటగా దీనిని సాగుచేస్తున్నారు రైతులు.. మరోవైపు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది… భారత్లో కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రైతులు అధికంగా సాగు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ పంట…