భారత జట్టు ప్రధాన కోచ్గా భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. హెడ్ కోచ్గా టీమిండియాలోకి గౌతమ్ గంభీర్ను సాదరంగా ఆహ్వానిస్తోన్నానని చెప్పారు. కాగా.. రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్ హెడ్ కోచ్ గా నియమితులయ్యారు. టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగిసింది.