ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ లేని ఇళ్లపై యజమానులు పూర్తి హక్కు పొందేందుకు వీలుగా వైసీపీ సర్కార్.. ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ స్కీమ్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపై అనేక విమర్శలు కూడా లేకపోలేదు.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సహా విపక్షాలు అన్నీ ఈ పథకంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.. అయితే, ఈ పథకాన్ని ఈ నెల 21వ తేదీన ప్రారంభించనున్నారు. పశ్చిమగోదావరి…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో లేఖ రాశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. ప్రభుత్వానికి అనేక అంశాలపై లేఖలు రాస్తూ వచ్చిన ఆయన.. ఈ సారి కోడిగుడ్ల నాణ్యతను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే కోడిగుడ్లల్లో నాణ్యత లేదని లేఖలో పేర్కొన్నా సోము వీర్రాజు.. కుళ్లిపోయిన కోడిగుడ్లను ఇవ్వడం వల్ల పిల్లలకు వాంతులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.. పౌష్టికాహార లోపాన్ని నివారించేలా కేంద్రం తగినంతగా నిధులిస్తున్నా..…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బిశ్వభూషణ్ హరిచందన్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం ముగిసింది. గవర్నర్ దంపతుల ఆరోగ్యపరిస్థితిని ముఖ్యమంత్రి దంపతులు అడిగి తెలుసుకున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యలో బాధపడుతున్న గవర్నర్ను కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. కొన్ని రోజుల క్రితం బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా బారిన పడ్డారు. హైదారాబాద్లో ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్నారు. అయితే, పోస్ట్ కరోనా తరువాత మళ్లీ ఇబ్బందులు తలెత్తడంతో తిరిగి హైదరాబాద్లోని ఆసుపత్రిలో కొన్నిరోజులు ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్నాక ఏపీ వచ్చారు.…
పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్… పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులోకి ఆర్టీసీ బస్సు పడిపోయిన ఘటనలో ఇప్పటికే ఐదుగురు మహిళలు సహా 9 మంది మృతిచెందారు.. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు పోలీసులు.. అయితే, ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం వైఎస్…
ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్.. భారత్లోకి ప్రవేశించింది.. క్రమంగా రాష్ట్రాలకు విస్తరిస్తోంది.. ఆంధ్రప్రదేశ్లోనూ ఒమిక్రాన్ కేసు వెలుగు చూడడంతో.. ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు బయటపడిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య రంగంపై సమీక్ష చేపట్టనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమీక్ష సమావేశం జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ ఒమిక్రాన్ కేసులు లేకపోయినా తీసుకోవాల్సిన ముందస్తు చర్యల పై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం వైఎస్…
రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల దగ్గర సమగ్ర పరిశీలన చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇవాళ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్వహణ పరిస్థితులు సరిదిద్దాలన్నారు. రాష్ట్ర విభజన నుంచి వీటి గురించి పట్టించుకోలేదు.. దీని వల్ల ముప్పు పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని.. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వారీగా తగినంత మంది నిర్వహణా సిబ్బంది ఉన్నారా లేదా…
ఓటీఎస్ పథకం విషయంలో ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు.. ముఖ్యంగా టీడీపీ ఈ విషయంలో వైసీపీ సర్కార్ను నిలదీస్తోంది… అయితే, విపక్షాలపై కౌంటర్ ఎటాక్కు దిగారు సీఎం వైఎస్ జగన్.. ఓటీఎస్ పథకం, గృహ నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా.. ఓటీఎస్ పథకం పై ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.. ఓటీఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి.. ఓటీఎస్ అన్నది పూర్తి స్వచ్ఛందం.. క్లియర్ టైటిల్తో రిజిస్ట్రేషన్ జరుగుతుంది.. రూ.10వేల కోట్ల రూపాయల…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ఉత్తర్వులు జారీ చేసింది.. ప్రైవేట్ లేఔట్ల నిర్మాణాల్లో 5 శాతం భూమిని ఇవ్వాలంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ భూమిని సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించింది ఏపీ ప్రభుత్వం.. కొత్తగా నిర్మించే లేఔట్లో భూమిని ఇవ్వలేకుంటే.. దానికి మూడు కిలోమీటర్ల పరిధిలో భూమిని కొని ఇవ్వాలని నిబంధన విధించింది. లేని పక్షంలో ఆ భూమి విలువ మేర.. డబ్బులు కూడా చెల్లించే ఆప్షన్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఇక,…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలో అంబేద్కర్ భావజాలం ఉంది.. ఈ ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేని స్థాయిలో దేశంలో భిన్నత్వం ఉంటుంది.. అందరినీ ఒకే తాటిపై నడిపించే విధంగా రాజ్యాంగ రూపకల్పన చేశారు.. వర్ణ, కుల…
జలప్రళయం ముంచుకొస్తోందని వాతావరణశాఖ హెచ్చరించినా తాడేపల్లి ప్యాలెస్లో పవళిస్తున్న జగన్ ఇంకా నిద్రలేవలేదని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ .. ఏపీ సీఎం జగన్ పై విమర్శల వర్షం కురింపించారు.వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో ప్రకటించారన్నారు. సీఎం జగన్ నిర్లక్ష్యం కారణంగా అధికారిక లెక్కల ప్రకారమే 39…