Home
Cm Kcr
Cm Kcr News
-
నీళ్లు, నిధులు, నియామకాలు మొత్తం కెసిఆర్ కుటుంబానికే : బండి సంజయ్
సిఎం కెసిఆర్ పై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్లు నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని.. తెలంగాణ వచ్చాక ..నీళ్లు ఫామ్ హౌజ్ కు, నిధులు సీఎం అనుయాయులకు, నియామకాలు ఆయన ఫ్యామిలకే పోయాయని ఫైర్ అయ్యారు. తొలి దశ, మలి దశ ఉద్యమానికి ఊపిరే యువత అని..ఆ యువత తెలంగాణ ఏర్పడ్డాక 7 ఏళ్లుగా ఉద్యోగం, ఉపాధి లేక అల్లాడుతోందన్నారు. లక్షలాది మంది యువతీ,… -
త్వరలో డిజిటల్ భూ సర్వే.. ఏడు కంపెనీలతో సీఎస్ భేటీ
రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సర్వే చేసి నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే సంచలన ప్రకటన చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే చేసి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్(అక్షాంశ రేఖాంశాలు) ఇస్తామని తెలిపారు.. ఈ సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో.. ప్రభుత్వం ఎంతో శ్రమించి, ప్రవేశ పెట్టి, అమలు చేస్తున్న ధరణి పోర్టల్ నూటికి నూరు పాళ్లు విజయవంతమైందని..… -
జూన్ 3 వరకు సూపర్ స్పైడర్లందరికి వ్యాక్సీన్ హరీష్ రావుకు కేసీఆర్ ఆదేశాలు.!
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు టీకా సేకరణ, డ్రైవర్లకు వ్యాక్సినేషన్ పై ఆర్ధిక శాఖామాత్యులు హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2021 జూన్ 3వ తేదీ నుండి రాష్ట్రంలోని అందరు ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మరియు మాక్సి క్యాబ్ డ్రైవర్లకు వ్యాక్సిన్ అందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. జి.హెచ్.ఎం.సి ప్రాంతంతో పాటు ఇతర జిల్లా ప్రధాన కేంద్రాలతో కలిపి రోజుకు… -
కేసీఆర్ గుడ్న్యూస్.. రేషన్కార్డుపై ప్రతీ వ్యక్తికి 15 కిలోల ఉచిత బియ్యం
కరోనా సెకండ్ వేవ్ సంక్షోభం సమయంలో పేదలను అండగా నిలిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. సడలింపులు ఉన్న రంగాలు తప్పితే.. లాక్డౌన్తో అంతా ఇళ్లకే పరిమితం అవుతుండడంతో.. పేదలకు తినడానికి తిండిలేక.. దాతల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉంది.. అయితే.. పేదల కడుపు నింపేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. జూన్ నెలలో ప్రతీ వ్యక్తికి 15 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందజేయనున్నారు.. దీంతో.. రాష్ట్రంలోని 2 కోట్ల 79 లక్షల 24 వేల 300… -
ప్రతి రంగంలోనూ ప్రజలు న్యాయం కోసం రోడెక్కుతున్నారు: షర్మిల
విద్య, వైద్యం, వ్యవసాయం, న్యాయం కోసం ప్రతిరంగంలోనూ ప్రజలు రోడెక్కుతున్నారని తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలోని అన్నదాతలు రోడెక్కుతున్నారని, కొనుగోలు సెంటర్లలో వడ్లు కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రతి రంగంలోనూ ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలపాల్సి వస్తోందని అన్నారు. విద్య కోసం రోడ్డెక్కాలి.. వైద్యం కోసం రోడ్డెక్కాలి.. న్యాయం కోసం రోడ్డెక్కాలి.. పండిన పంట కొనుగోలు కోసం రోడ్డెక్కాలి.. కొన్న పైసల కోసం పాట్లు పడాలి.. నెలల… -
తెలంగాణలో లాక్ డౌన్ : తెలుగులో ట్వీట్ చేసిన ఒవైసీ
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ తెలంగాణ క్యాబినెట్ సమావేశం అవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓ విజ్ఞప్తి చేశారు. అందులో తెలుగులో ట్వీట్ చేయడం గమనార్హం. లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ మంత్రివర్గం ఇవాళ సమావేశమవుతోందని… లాక్ డౌన్ పై తన వ్యతిరేకతను మరోమారు స్పష్టం చేస్తున్నానని పేర్కొన్నారు. కోవిడ్ 19 ను ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదు…దీంతో పేదల జీవితాలు నాశనమవుతాయని తెలిపారు.… -
కెసిఆర్ పై ఈటల జమున సంచలన వ్యాఖ్యలు : నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా..
సిఎం కెసిఆర్ జమున హేచరిస్ అధినేత ఈటెల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. తమపై నెల రోజుల నుండి ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని.. వాటిని ఎలా తిప్పికొట్టాలో మాకు తెలుసు అని ఫైర్ అయ్యారు. మేము ఏ రోజు కూడా తప్పు చేయలేదని..మసాయిపేట్ లో 46 ఎకరాలు కొన్నది వాస్తవమని..బడుగు, బలహీన వర్గాల నుంచి మేము భూములు తీసుకుంటామా? అని ప్రశ్నించారు. మేము కొన్న భూమి కన్నా ఒక్క ఎకరం ఎక్కువ ఉన్న ముక్కు నేలకు… -
సీఎం కేసీఆర్కు ఎంపీ రఘురామ లేఖ
తెలంగాణ సిఎం కెసిఆర్ కు రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. తన అరెస్ట్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ పోలీసులపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఒక ప్రజా ప్రతినిధిని అరెస్ట్ చేసే సమయంలో పొరుగు రాష్ట్ర పోలీసులు అనుసంచాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలను గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్వో) పట్టించుకోలేదని వెల్లడించారు. అరెస్టు చేసే ముందు తన ఆరోగ్య పరిస్థితిపై స్థానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయించాలన్న నిబంధనను కూడా పట్టించుకోలేదన్నారు. ఆ… -
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..లాక్ డౌన్లో సడలింపులు ?
ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ పొడిగింపు, తదితర అంశాల మీదపై కేబినెట్ చర్చించనున్నది. రాష్ట్రంలో ఇవాళ్టితో 18 రోజుల లాక్ డౌన్ ముగియనుంది. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో లాక్ డౌన్ నుంచి మరిన్ని సడలింపులు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇందులో భాగంగానే వీక్ ఎండ్ లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ వైపు అడుగులు అడుగులు వేస్తోంది ప్రభుత్వం.… -
కేసిఆర్, జగన్, చంద్రబాబులు మోడీకి భయపడుతున్నారు
దేశంలో ప్రజల ఇబ్బందులకు ప్రధాని మోడీనే బాధ్యత వహించాలని సిపిఐ రామకృష్ణ అన్నారు. కరోనా కంట్రోల్ చేసింది మోడీ వల్లే నంటూ గతంలో బిజెపి తీర్మానం చేసిందని..సెకండ్ వేవ్ లో వైఫల్యానికి మాత్రం మోడీ కారణం కాదంటారా ? అని ఫైర్ అయ్యారు. ఎన్నికలు నిర్వహణ, కుంభమేళా పెట్టడం వల్లేనని..దేశంలోనే యాభై శాతం కరోనా కేసులు నమోదయ్యాయని మండిపడ్డారు. ప్రజల ప్రాణాల కన్నా ఎన్నికలలో విజయమే ముఖ్యంగా మోడీ పని చేశారని..పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది సార్లు…
తాజావార్తలు
-
Iran Mocks Trump: ‘‘షట్ అప్, ట్రంప్’’.. హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ సెటైర్లు..
-
Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు..!
-
Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..
-
Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!
-
Darling Re Release: ప్రభాస్ ఫ్యాన్పై థియేటర్ మేనేజ్మెంట్ దాడి?
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!