ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఆదాయపు పన్నుల శాఖ(ఐటీ) నోటీసులు జారీ చేసింది. అయితే దీన్ని ఆయన ప్రేమలేఖగా అభివర్ణిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనకు ఐటీ నోటీసు వచ్చిందని అది ప్రేమలేఖ అని ఆయన గురువారం ట్వీట్ చేశారు. 2004, 20009, 2014, 2020 సంవత్సరాల్లో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ కు సంబంధించి తాజాగా ఐటీ నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయిన…
మహారాష్ట్ర కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఏక్ నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేకు షాక్ ఇవ్వబోతున్నారు. గతంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం వివాదాస్పద ముంబై మెట్రో కార్ షెడ్ ప్రాజెక్ట్ ను ఆరే కాలనీలో నిర్మించడాన్ని వ్యతిరేకించింది. దీన్ని కంజుర్మార్గ్ కు మార్చాలని నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం ఆరే కాలనీలోనే మెట్రోకార్ షెడ్ ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు సిద్ధం అవుతున్నట్లుగా సమాచారం. 2019లో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం హాయాంలో అనుకున్న…
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడింది. శివసేన నేత ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో గౌహతిలో క్యాంప్ పెట్టినప్పటి నుంచి సినిమాను తలపించే ట్విస్టులతో రాజకీయం రసవత్తంగా సాగింది. ఓ వైపు ఉద్ధవ్ ఠాక్రే, శరత్ పవార్, మరో వైపు ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే ఇలా రెండు వర్గాల మధ్య ఎత్తులు పైఎత్తుల మధ్య అధికారం దోబూచులాడింది. చివరకు రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే, బీజేపీ మద్దతుతో సీఎం పీఠాన్ని…