తెలంగాణలో యువతను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. యువత ఉద్యమం కోసం బలిదానం చేసుకుంది… ఇప్పుడు ఉద్యోగాల కోసం చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నోటిఫికేషన్స్ గురించి మాట్లాడకుండా వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ది కోసం తాము ఉద్యమం చేయడం లేదని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం మాట్లాడారో గుర్తుచేస్తున్నామన్నారు. అప్పుడేం చెప్పావ్.. ఇప్పుడేం చేస్తున్నావ్ అన్నారు బండి సంజయ్.…