BJP: ఢిల్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో, అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై బీజేపీ దాడి ప్రారంభించింది. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్గా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఆలయ పూజారులకు, గురుద్వారా గ్రాంథీలకు ప్రతీ నెలా రూ. 18,000 ఇస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చిన తర్వాత.. ‘‘ ఎన్నికల హిందువు’’ అంటూ బీజేపీ విమర్శలు ప్రారంభించింది.