వివాదాస్పద ప్రసంగాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నిర్మాత బండ్ల గణేశ్.. చోర్ బజార్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పూరీ జగన్నాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘‘ఎందరినో స్టార్ హీరోల్ని చేసిన నీకు, నీ కొడుకు ఈవెంట్ కి రావడానికి టైం లేదా? ముంబైలో వెళ్లి కూర్చున్నావ్’’ అంటూ ఓ రేంజ్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అంతేకాదు.. ‘పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నావ్, వాళ్లందరినీ చచ్చేదాకా చూసుకోవాల్సిన బాధ్యత నీదే’నంటూ వ్యక్తిగతంగానూ టార్గెట్ చేశాడు.…
బండ్ల గణేష్. కామెడియన్గా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి.. నటుడిగా ఎదుగుతూ నిర్మాతగా బ్లాక్ బస్టర్ సినిమాలు అందించారు. ఇండస్ట్రీలో ఆయన ఎప్పుడూ ప్రత్యేకం. ఆ ప్రత్యేకత కారణంగానే ఆయన ఏం మాట్లాడినా సంచలనంగా మారుతుంది. పవన్ కల్యాణ్కు వీరాభిమానిగా చెప్పుకొంటారు. సినిమా పంక్షన్స్లో మైక్ పట్టుకుంటే పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు కూడా. అయితే ఇటీవల కాలంలో బండ్ల గణేష్ తీరు అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఆయన ఏం మాట్లాడుతున్నారో? ఏం మాట్లాడాలని ఇంకే మాట్లాడుతున్నారో అర్థం…
తన ‘చోర్ బజార్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆకాశ్ పూరీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా.. నెపోటిజంపై సుదీర్ఘంగా ప్రసంగించాడు. తనపై కూడా నెపోటిజం కామెంట్స్ వచ్చాయని తెలిపిన ఆకాశ్.. బ్యాక్గ్రౌండ్తో వచ్చిన ట్యాలెంట్ నిరూపించుకుంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారని, తానూ అదే ప్రయత్నం చేస్తున్నానని తెలిపాడు. తాను చిటికేస్తే కోరుకున్నవన్నీ తన ముందు వాలుతాయని, తన తండ్రి ఏం అడిగినా ఇచ్చేంత సౌకర్యం తనకుందని, కానీ తాను మాత్రం తన కాళ్లపై నిలబడాలనుకుంటున్నానని, అందుకే కష్టపడుతున్నానని అన్నాడు.…