DK Shivakumar: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు తృటిలో ప్రమాదం తప్పింది. శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పక్షి ఢీకొట్టింది. దీంతో హెలికాప్టర్ ను పైలెట్ చాకచక్యంగా సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదం నుంచి డీకే శివకుమార్ తప్పించుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆయనతో పాటు కర్ణాటకకు చెందిన ఓ న్యూస్ రిపోర్టర్ కూడా హెలికాప్టర్ లో ఉన్నారు.