ఓనం పండుగ సందర్భంగా అపార్ట్మెంట్ సముదాయంలో చిన్నారులు పూలతో పుష్పాలంకరణ చేశారు. అయితే ఒక మహిళ నలుగురు తిరిగే స్థలంలో ఇలాంటివి ఎందుకు ఏర్పాటు చేశారంటూ వాగ్వాదానికి దిగింది. అంతేకాకుండా ఓనం పండుగ స్వాగత అలంకరణను కాళ్లతో చెరిపేసింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్య కుక్కలు.. మనుషులపై ఎలా దాడి చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇక చిన్నపిల్లల ప్రాణాలైతే గాల్లో కలిసిపోతున్నాయి. ఇలా దేశంలో ఆయా చోట్ల ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.
ప్రకృతి విలయంతో వయనాడ్ కకావికలం అయింది. ఊహించని విపత్తుతో ఆప్తుల్ని కోల్పోవడంతో పాటు ఆస్తుల్ని పోగొట్టుకుని దు:ఖ సముద్రంలో ఉన్న బాధితులకు ప్రధాని మోడీ అండగా నిలిచారు. వారి కష్టాలను, బాధలను తెలుసుకుని చలించిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ధైర్యవంతులైన విద్యార్థులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారంటూ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా వీడియో సందేశం విడుదల చేశారు. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్కు రాగానే.. జియాను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ విడుదల చేశారు.
ఇథియోపియాను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. మరోవైపు పెద్ద ఎత్తున బురద జలాలు ఏరులైపారడంతో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది పలువుర్ని కాపాడారు.
చిన్న పిల్లలు నవ్వినప్పుడు, ఆడినప్పుడు చాలా అందంగా కనిపిస్తారు. కానీ కొన్నిసార్లు వారి ఆకస్మిక దూకుడు కార్యకలాపాలు కోపం తెప్పిస్తాయి. అయినప్పటికీ, వారు చేసే ఈ దూకుడు కార్యకలాపాల వెనుక చాలా కారణాలు ఉండవచ్చు.
యూపీలోని హమీర్పూర్లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రేమికుడి చేతిలో మోసపోయిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తనతో పాటు తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి సూసైడ్ చేసుకుంది. ఒక్కసారి ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటన ముస్కరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంద్వా గ్రామంలో చోటుచేసుకుంది.
చదివినవి బాగా గుర్తు పెట్టుకుంటే పరీక్షలు రాయొచ్చు. పిల్లలకు చదివినవి సరిగా గుర్తుండవు, పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయి. ఇందుకోసం వారికి జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాన్ని ఇవ్వాలి.