తమిళనాడు రాష్ట్రంలో ఫెంగల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. భారీ వర్షాలతో విల్లుపురం జిల్లాలో వరద బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనను నిలిపి వేయాలని వారితో చర్చలు జరిపేందుకు వెళ్లిన సమయంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పొన్ముడి సహా ఇతర డీఎంకే నేతలపై పెద్ద ఎత్తున బురదను చల్లారు.
తమిళనాడులో రాష్ట్రంలో ఫెంగల్ తుఫాన్ ఘోర విషాదం నింపింది. భారీ వర్షాల ధాటికి 18 మంది మృతి చెందారు. తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షాలకు తిరువన్నమలైలో కొండ చరియలు విరిగిపడ్డాయి పలు ఇళ్లపై.. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు.
పుదుచ్చేరి, తమిళనాడులోని స్కూల్స్, కాలేజీలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చెన్నై, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, మైలాడుతురై జిల్లాల్లో ఈ రోజు మూతపడ్డాయి.
తమిళ నటి కస్తూరికి చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు పుఝల్ సెంట్రల్ జైలుకు కస్తూరిని తరలించారు. నిన్న(శనివారం) రాత్రి హైదరాబాద్లో కస్తూరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
తిరునెల్వేలి-చెన్నై మధ్య నడుస్తున్న వందేభారత్ రైలులో ఆహారంగా వడ్డించిన సాంబార్లో మూడు కీటకాలు కనిపించాయి. వాటిని కనుగొన్న ప్రయాణిస్తున్న మురుగన్ అనే ప్రయాణికుడు ఫుడ్ ప్రొవైడర్కు ఫోన్ చేశాడు. తన చేతితో రెండు పురుగులను తొలగించగా.. మిగిలిన పురుగును మురుగన్ తన చేత్తో పట్టుకుని చూపించాడు.
Smuggling Dolls: చెన్నై నగరంలో స్మగ్లింగ్ సంబంధించిన ఓ విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనలో సుమారు 7 కోట్లు పైగా విలువ చేసే ఏనుగు దంతాలతో తయారు చేసిన 4 ఏనుగు బొమ్మలను స్వాదినం చేసుకున్నారు చెన్నై అటవీశాఖ అధికారులు. నగరంలోని విల్లుపురం కొత్త బస్ స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఈ బొమ్మలకు సంబంధించి బేరమాడి విక్రయిస్తుండగా అటవీశాఖ అధికారులు, విల్లుపురం పోలిసు అధికారులు అరెస్టు చేసారు. ఈ ఘటనలో చెన్నై, తిరుచ్చి,…
తల్లిపై బిడ్డలకు మమకారం ఉంటుంది. మాతృమూర్తికి కష్టం వస్తే పేగు పంచుకుని పుట్టిన బిడ్డలు సహించలేరు. ఆ గుండెలు తల్లడిల్లిపోతాయి. కారణం.. తల్లి, బిడ్డల మధ్య ఉండే రిలేషన్ అలాంటిది. ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవండి.
పుట్టిన రోజు వేళ హీరో కమల్ హాసన్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెన్నైలోని కమల్హాసన్ ఇంటి ఎదుట ముస్లింల ధర్నాకి దిగారు. కమల్ హాసన్ నిర్మించిన అమరన్లో ముస్లింలను ఉగ్రవాదులుగా చూపారని ఆరోపిస్తూ అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని SDPI డిమాండ్ చేసింది. కమల్హాసన్ దిష్టిబొమ్మ దహనం చేసిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నటుడు-నిర్మాత కమల్ హాసన్ నిర్మించిన, శివకార్తికేయన్-నటించిన అమరన్ ఇండియన్ ఆర్మీలో పనిచేసి మరణించిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని…
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్ల మార్పు రావడం లేదు. తాజాగా తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ముంబైకి చెందిన ఓ బాలికపై ఆటో డ్రైవర్ సహా ఆరుగురు టెక్కీలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.