Viluppuram: తమిళనాడులో వరద బాధితుల ఆగ్రహం.. మంత్రిపై బురద చల్లిన వైనం
- తమిళనాడులో ఫెంగల్ తుఫాన్ ధాటికి బాధితులు తీవ్ర ఇబ్బందులు..
- విల్లుపురం జిల్లాలోని ఇరువేల్పట్టులో మంత్రిపై బురద చల్లిన బాధితులు..
- మంత్రి పొన్ముడి వాహనంపై రాళ్లతో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viluppuram: తమిళనాడు రాష్ట్రంలో ఫెంగల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. భారీ వర్షాలతో విల్లుపురం జిల్లాలో వరద బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విల్లుపురం జిల్లాలోని ఇరు వేల్పట్టు ప్రాంతం తిరుచిరాపల్లి- చెన్నై రహదారిపై ప్రయాణికులు, స్దానికుల నిరసన ప్రదర్శన చేశారు. నిరసనను నిలిపి వేయాలని వారితో చర్చలు జరిపేందుకు వెళ్లిన సమయంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పొన్ముడి సహా ఇతర డీఎంకే నేతలపై పెద్ద ఎత్తున బురదను చల్లారు. వాహనంలో వెలుతున్న సమయంలో కొందరు వ్యక్తులు కారుపై రాళ్లు రువ్వినట్లు సమాచారం. ఇక, ఆందోళనకారుల బురద చల్లిన వెంటనే మంత్రిని కారులో ఎక్కించి పోలీసులు అక్కడి నుంచి పంపించారు. గత ఆరు గంటలుగా కనీసం నీళ్లు కూడా లేకుండా పడిగాపులు కాస్తున్నామని డీఎంకే నేతలపై వరద బాధితుల మండిపడ్డారు.
Read Also: Pushpa2 : పుష్ప మేకింగ్ వీడియో రిలీజ్.. పుష్పగాడు ప్యూర్ మాస్
Also Read
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
కాగా, కోయంబత్తూరు- బెంగళూరుకు, సేలం నుంచి బెంగళూరుకు.. విల్లుపురం నుంచి బెంగళూరు- చెన్నై వెళ్లే జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుంది. ఎనిమిది గంటలుగా ఆయా జాతీయ రహదారులపై వేలాది వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి వెహికిల్స్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు ఆహారాన్ని అందించాలంటూ జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. గత మూడు రోజులుగా సేలం, విల్లుపురం బస్టాండ్ లు నీటిలోనే ఉండిపోయాయి. దీంతో పాటు వరదల కారణంగా నీట మునిగిపోయిన లోతట్టు కాలనీలకు ఇంకా పూర్తిస్థాయిలో సహాయక చర్యలు కొనసాగడం లేదు. ఒకటిన్నర రోజుగా వరదలోనే మూడు జిల్లాల్లోని వేలాది కుటుంబాలు ఉండిపోయాయి.
తాజావార్తలు
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!