Viluppuram: తమిళనాడులో వరద బాధితుల ఆగ్రహం.. మంత్రిపై బురద చల్లిన వైనం
- తమిళనాడులో ఫెంగల్ తుఫాన్ ధాటికి బాధితులు తీవ్ర ఇబ్బందులు..
- విల్లుపురం జిల్లాలోని ఇరువేల్పట్టులో మంత్రిపై బురద చల్లిన బాధితులు..
- మంత్రి పొన్ముడి వాహనంపై రాళ్లతో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viluppuram: తమిళనాడు రాష్ట్రంలో ఫెంగల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. భారీ వర్షాలతో విల్లుపురం జిల్లాలో వరద బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విల్లుపురం జిల్లాలోని ఇరు వేల్పట్టు ప్రాంతం తిరుచిరాపల్లి- చెన్నై రహదారిపై ప్రయాణికులు, స్దానికుల నిరసన ప్రదర్శన చేశారు. నిరసనను నిలిపి వేయాలని వారితో చర్చలు జరిపేందుకు వెళ్లిన సమయంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పొన్ముడి సహా ఇతర డీఎంకే నేతలపై పెద్ద ఎత్తున బురదను చల్లారు. వాహనంలో వెలుతున్న సమయంలో కొందరు వ్యక్తులు కారుపై రాళ్లు రువ్వినట్లు సమాచారం. ఇక, ఆందోళనకారుల బురద చల్లిన వెంటనే మంత్రిని కారులో ఎక్కించి పోలీసులు అక్కడి నుంచి పంపించారు. గత ఆరు గంటలుగా కనీసం నీళ్లు కూడా లేకుండా పడిగాపులు కాస్తున్నామని డీఎంకే నేతలపై వరద బాధితుల మండిపడ్డారు.
Read Also: Pushpa2 : పుష్ప మేకింగ్ వీడియో రిలీజ్.. పుష్పగాడు ప్యూర్ మాస్
Also Read
కాగా, కోయంబత్తూరు- బెంగళూరుకు, సేలం నుంచి బెంగళూరుకు.. విల్లుపురం నుంచి బెంగళూరు- చెన్నై వెళ్లే జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుంది. ఎనిమిది గంటలుగా ఆయా జాతీయ రహదారులపై వేలాది వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి వెహికిల్స్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు ఆహారాన్ని అందించాలంటూ జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. గత మూడు రోజులుగా సేలం, విల్లుపురం బస్టాండ్ లు నీటిలోనే ఉండిపోయాయి. దీంతో పాటు వరదల కారణంగా నీట మునిగిపోయిన లోతట్టు కాలనీలకు ఇంకా పూర్తిస్థాయిలో సహాయక చర్యలు కొనసాగడం లేదు. ఒకటిన్నర రోజుగా వరదలోనే మూడు జిల్లాల్లోని వేలాది కుటుంబాలు ఉండిపోయాయి.
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?