Viluppuram: తమిళనాడులో వరద బాధితుల ఆగ్రహం.. మంత్రిపై బురద చల్లిన వైనం
- తమిళనాడులో ఫెంగల్ తుఫాన్ ధాటికి బాధితులు తీవ్ర ఇబ్బందులు..
- విల్లుపురం జిల్లాలోని ఇరువేల్పట్టులో మంత్రిపై బురద చల్లిన బాధితులు..
- మంత్రి పొన్ముడి వాహనంపై రాళ్లతో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viluppuram: తమిళనాడు రాష్ట్రంలో ఫెంగల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. భారీ వర్షాలతో విల్లుపురం జిల్లాలో వరద బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విల్లుపురం జిల్లాలోని ఇరు వేల్పట్టు ప్రాంతం తిరుచిరాపల్లి- చెన్నై రహదారిపై ప్రయాణికులు, స్దానికుల నిరసన ప్రదర్శన చేశారు. నిరసనను నిలిపి వేయాలని వారితో చర్చలు జరిపేందుకు వెళ్లిన సమయంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పొన్ముడి సహా ఇతర డీఎంకే నేతలపై పెద్ద ఎత్తున బురదను చల్లారు. వాహనంలో వెలుతున్న సమయంలో కొందరు వ్యక్తులు కారుపై రాళ్లు రువ్వినట్లు సమాచారం. ఇక, ఆందోళనకారుల బురద చల్లిన వెంటనే మంత్రిని కారులో ఎక్కించి పోలీసులు అక్కడి నుంచి పంపించారు. గత ఆరు గంటలుగా కనీసం నీళ్లు కూడా లేకుండా పడిగాపులు కాస్తున్నామని డీఎంకే నేతలపై వరద బాధితుల మండిపడ్డారు.
Read Also: Pushpa2 : పుష్ప మేకింగ్ వీడియో రిలీజ్.. పుష్పగాడు ప్యూర్ మాస్
Also Read
కాగా, కోయంబత్తూరు- బెంగళూరుకు, సేలం నుంచి బెంగళూరుకు.. విల్లుపురం నుంచి బెంగళూరు- చెన్నై వెళ్లే జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుంది. ఎనిమిది గంటలుగా ఆయా జాతీయ రహదారులపై వేలాది వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి వెహికిల్స్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు ఆహారాన్ని అందించాలంటూ జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. గత మూడు రోజులుగా సేలం, విల్లుపురం బస్టాండ్ లు నీటిలోనే ఉండిపోయాయి. దీంతో పాటు వరదల కారణంగా నీట మునిగిపోయిన లోతట్టు కాలనీలకు ఇంకా పూర్తిస్థాయిలో సహాయక చర్యలు కొనసాగడం లేదు. ఒకటిన్నర రోజుగా వరదలోనే మూడు జిల్లాల్లోని వేలాది కుటుంబాలు ఉండిపోయాయి.
తాజావార్తలు
-
HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
-
Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!
-
Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
-
Ben Stokes Returns: ‘క్రికెట్పై మళ్లీ ఆసక్తి వచ్చింది’.. రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ ఆల్రౌండర్
-
Lockup Death: ఏపీలో లాకప్ డెత్లు పరంపర.. రెండు జిల్లాల్లో ప్రకంపనలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!