టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకని స్థితి టిడిపిది అని.. బక్వాస్ మాటలతో నవ్వులపాలు కావొద్దు అని చంద్రబాబుకు చురకలు అంటించారు. “ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే తన పార్టీ గెలుస్తుందట. సంక్షేమం అమలులో విఫలమైనందువల్ల ప్రజలు జగన్ గారిని వ్యతిరేకిస్తున్నారట! ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకని స్థితి నీది. డిపాజిట్ దక్కితే చాలనుకున్న సంగతి ప్రజలింకా మర్చిపోలేదు. బక్వాస్ మాటలతో నవ్వులుపాలు కావొద్దు చంద్రం. స్వీయ…
టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. కరోనా వైరస్ లాగానే చంద్రబాబు.. రోజుకో వేరియంట్ గా మారుతున్నాడని ఎద్దేవా చేశారు. “కరోనా వైరస్ లాగానే చంద్రబాబు రోజుకో తీరు మారుతున్నాడు. ప్రజలను ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు కొత్త వేరియంట్ లా మారుతున్నాడు. బాబూ, నీది మీటర్ గేజ్ పై తిరిగే రైలు. ఈ రెండేళ్లలో రాష్ట్రమంతా గేజి మార్పిడి జరిగి బ్రాడ్ గేజ్ అందుబాటులోకి వచ్చింది. అయినా ఈ పట్టాల మీదే…
ఎన్నికల్లో వైఎస్ జగన్ ఇచ్చిన మేనిఫెస్టో లో ప్రతి అంశాన్ని నెరవేర్చేలా చర్యలు తీసుకున్నారు. మేనిఫెస్టో లో ఇచ్చి హామీల్లో నూటికి 94శాతం హామీలు సీఎం నెరవేర్చారు అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రతి లబ్దిదారుడికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలో నగదు బదిలీ చేశారు. 2ఏళ్ల పాలనపై సీఎం విడుదల చేసిన పుస్తకాన్ని ప్రతి లబ్ది దారుడికి పంపిస్తాం. సంక్షేమం అభివృద్దిని రెండు కళ్లుగా ప్రభుత్వం భావిస్తోంది. వైఎస్…
టిడిపి అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు పిల్లి శాపాలకు ఎవరు భయపడబోరని చరకలు అంటించారు విజయసాయిరెడ్డి. వచ్చే మహానాడు వరకు టిడిపి పార్టీ ఉంటుందో లేదో చూసుకోవాలని చంద్రబాబు సూచనలు చేశారు. “పిల్లి శాపాలకు ఉట్లు తెగవు బాబూ. 2024 ఎన్నికల గురించి ఇప్పుడే జోస్యాలు చెబ్తున్నావు. వచ్చే మహానాడు వరకు నీ పార్టీ ఉంటుందో లేదో చూసుకో. మూడేళ్ల తర్వాత జగన్ గారి వెంట ఎవరూ మిగలరని శోకాలు…
చంద్రబాబు, నారా లోకేష్ పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ బతికుండగా జగన్ ను ఓడించలేరని.. ఈ రెండేళ్ల పాలన చూసి 2014లో చంద్రబాబుకు ఓటు వేసి తప్పు చేశాం అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. దేశానికే జగన్ ఆదర్శ ముఖ్యమంత్రి అని..చంద్రబాబులా వెన్నుపోటుతో జగన్ రాజకీయాల్లోకి రాలేదని చురకలు అంటించారు. ప్రజలను నమ్ముకుని, ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్న వ్యక్తి జగన్ అని..చంద్రబాబు చరిత్ర ముగిసిన అధ్యాయమన్నారు. గత…
టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. చంద్రబాబుకు వయసు, టైమ్ అయిపోయిందని.. అందుకే జూమ్ లో కాలక్షేపం చేస్తున్నాడని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. “గడియారం ముల్లుపై ఆశలు పెట్టుకుని జూమ్ లో కాలక్షేపం చేస్తుండు. శాశ్వతంగా అక్కడే మిగిలిపోతావు. కాలం పరుగులు పెడుతూనే ఉంటుంది. దానితో పోటీపడి పని చేస్తుంటాడు యువ సిఎం. నీకు వయసు మీద పడింది. టైమ్ అయిపోయింది. ముల్లు వెనక్కి తిరగదు.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక…
టిడిపి నిర్వహిస్తున్న మహానాడుపై మరోసారి వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. మహానాడు పేరు తీసేసి “నారా నేడు” లేదా “పప్పు డప్పు” అని పెట్టుకో సరిపోతుందని ఎద్దేవా చేశారు. “వైఎస్సార్ పంటల బీమా పథకంపై పడి ఏడుస్తాడు. రైతు భరోసా కింద డబ్బులిస్తే కేంద్ర నిధులంటాడు. కేంద్ర నిధులైతే అన్ని రాష్ట్రాల్లో ఉండాలిగా చంద్రబాబూ? మహానాడులో అబద్ధాలు ప్రచారం చెయ్యడానికి సిగ్గులేదూ ? మహానాడు పేరు తీసేసి “నారా నేడు” లేదా “పప్పు డప్పు” అని…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్.. ఓటుకు నోటు కేసులో భయపడి అప్పట్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు పారిపోయి వచ్చారని.. సినిమా డైరెక్టర్లను తీసుకువచ్చి విఠాలాచార్య అట్టముక్కలు, గ్రాఫిక్స్ లు ప్రజలకు చూపించిన వ్యక్తి చంద్రబాబేన్న ఆయన.. ఇక్కడ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించడంతో.. మళ్లీ హైదరాబాద్ కు పారిపోయారని ఎద్దేవా చేశారు.. ఇక, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేశారు.. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రలు…
ఇవాళ టిడిపి మహానాడు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మహానాడు కార్యక్రమంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానాడులో ప్రభుత్వంపై తీర్మానాలు పెట్టి ఏం పీకుతారు..? అంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. “ఏ పార్టీ అయినా ఓడిపోయాక ఆత్మపరిశీలన చేసుకుంటుంది. టీడీపీ మాత్రం పరనిందకే పరిమితమైంది. మహానాడులో ప్రభుత్వంపై తీర్మానాలు పెట్టి ఏం పీకుతావ్ బాబూ? కుప్పంలో ఎందుకు ఖంగుతిన్నావో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు ఎందుకు దొరకలేదో…