ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం కాబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు పోలీసులు. ఇప్పటి వరకు చలానా విధించినా వాహనదారులు వాటికి కట్టకుండా లైట్గా తీసుకొని వాహనలు నడుపుతున్నారు. తీరిగ్గా ఎప్పుడైనా కట్టుకోవచ్చులే అంటున్నారు. అయితే, ఇకపై అలాంటి ఆటలు సాగవని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. వాహనంపై ఏ ఒక్క చలానా కూడా పెండింగ్లో ఉండకూడదని, ఒకవేళ పెండింగ్లో చలానాలు ఉంటే వాహనాన్ని వెంటనే సీజ్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. వాహనానికి సంబందించి ఒక్క చలానా పెండింగ్లో ఉన్నా…
హైదరాబాద్లో పోలీసులు వాహనాలపై దృష్టిసారించారు. నిత్యం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనీఖీలు చేస్తున్నారు. పెండింగ్లో ఉన్న చలానాలను వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో, జూబ్లీహిల్స్లోని చెక్పోస్ట్ వద్ద ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా ఆ వాహనంపై దాదాపుగా 130 చలాన్లు ఉన్నాయి. టీఎస్ 10 ఈఆర్ 7069 నెంబర్ గల స్కూటీని చెక్ చేయగా 2017 నుంచి చలానాలు పెండింగ్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ చలానాల మొత్తం రూ.35,950…