స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదుపరి ఛైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియమితులయ్యారు. ఈ మేరకు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో శనివారం ఎంపిక చేసింది. శెట్టి ప్రస్తుతం ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్లు, టెక్నాలజీ వర్టికల్స్ను ఆయన చూస్తుంటారు.
Today (12-01-23) Business Headlines: ప్రత్యక్ష పన్నుల వసూళ్లు భేష్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు లక్ష్యానికి అనుగుణంగా కొనసాగుతున్నాయి. 10 నెలల్లో 14 పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ప్రభుత్వం నిర్దేశించుకున్న నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యంలో ఇది 86 పాయింట్ ఆరు ఎనిమిది శాతానికి సమానం. స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లకి సంబంధించి పోయినేడాదితో పోల్చితే ఇది దాదాపు పాతిక శాతం ఎక్కువ.