కోల్ కతా కోర్టులో వాదనలు కొనసాగాయి. నిందితుడి తరఫున లాయర్ కవితా సర్కార్ వాదనలు వినిపించింది. అనంతరం వాదనలు వినిపించాలని సీబీఐ తరఫున న్యాయవాదిని కోర్టు కోరింది. కానీ, సీబీఐ న్యాయవాది దీపక్ పోరియా అందుబాటులో లేకపోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. దీంతో.. ‘నిందితుడు సంజయ్ రాయ్కు బెయిల్ ఇవ్వమంటారా? అని మండిపడింది.