ఇటీవల జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో విలక్షణ నటుడు పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఒక నటుడిగా ఆయన ప్రతిభను అందరూ గౌరవిస్తారు, కానీ ఆయన ప్రదర్శిస్తున్న Double Standards మాత్రం విమర్శలకు దారితీస్తున్నాయి. తమిళనాడులో పా. రంజిత్ నేతృత్వంలో జరిగే వేదికలపై పార్తిబన్ తరచుగా కుల రహిత సమాజం గురించి, సమానత్వం గురించి మాట్లాడుతుంటారు. అభ్యుదయ భావజాలం ఉన్న వ్యక్తిగా అక్కడ తనని తాను ఆవిష్కరించుకుంటారు.…