S Jaishankar: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య అగ్గిరాజేసిన వేళ భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పరోక్షంగా కెనడాకు గడ్డి పెట్టారు. ఆ దేశాన్ని ఉద్దేశించేలా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సౌలభ్యం కోసం ఉగ్రవాదం, తీవ్రవాదం, హింసపై ప్రతిస్పందన ఉండకూడదని ఆయన అన్నారు.